విజయనగరం జిల్లాకు రెండు స్కోచ్ అవార్డులు రావడం సంతోషదాయకరమని కలెక్టర్ సూర్య కుమారి అన్నారు. ఈ అవార్డులు మా బాధ్యతను మరింత పెంచాయన్నారు. వీటి స్ఫూర్తితో ఆయా రంగాల్లో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తాం. ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రతీఒక్కరూ తప్పనిసరిగా వినియోగించాల్సి ఉందన్నారు. రక్తహీనత నివారణకు ఇది దివ్యవ ఔషదంగా పనిచేస్తుందన్నారు. అందుకే ప్రభుత్వం ఫోర్టిఫైడ్ బియ్యం వినియోగాన్ని తప్పనిసరి చేసిందన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం రోజురోజుకూ విస్తరిస్తోందన్నారు. భూసార పరిరక్షణకు, ఆరోగ్యకర సమాజాన్ని నెలకొల్పడానికి ప్రకృతి వ్యవసాయ పంటల వినియోగం చాలా అవసరమన్నారు. ప్రస్తుతం 93 గ్రామాల్లో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ సాగుపద్దతులను అవలంబిస్తుండగా, దీనిని 150 గ్రామాలకు విస్తరించాలని ప్రణాళికను రూపొందించామన్నారు. జిల్లాకు రెండు అవార్డులను సాధించడానికి సహకరించిన జిల్లా యంత్రాంగానికి, ప్రజలకు, రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.