ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తాం అని మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో ఆయన మన ఊరు మన బడి పథకంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతాయని, పాఠశాలలో అన్ని హంగులతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, శివకుమార్, శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కంటి కృష్ణ, రవికుమార్ చారి, విద్యా కమిటీ మెంబర్స్ బాలాజీ, సుడోల్ తన తరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి