అనకాపల్లి జిల్లా,నక్కపల్లి మండలం, వేంపాడు టోల్ ప్లాజా వద్ద కారులో 3 కోట్ల రూపాయలు నగదు తరలిస్తుండగా నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. కారుతో పాటు నగదును,నగదు తరలిస్తున్న వ్యక్తిని పోలీసు స్టేషన్ కు తరలించారు.
నక్కపల్లి పోలీసులు అనకాపల్లి జిల్లా ఎస్పీ కి డబ్బులు విషయమై సమాచారం అందించారు. నగదు మొత్తం మూడు కోట్లు రూపాయలు గా జిల్లా ఎస్పీ గౌతమి శాలీ నిర్ధారించారు. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు నగదు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.