లక్షా ఇరవై వేలు ఇచ్చి నిరుపేదలకు ఇండ్లు నిర్మిస్తామని చెబుతున్న ఈ జగన్ ప్రభుత్వం… అదే నిరుపేదల నుంచీ డబ్బులు కడితే నేను సొంతింటి కల నెరవేరుతుందని చెబుతోందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయనగరం గుంకలాం లో “జగనన్న ఇండ్ల నిర్మాణం.. పేదలకు కన్నీళ్లు పరిష్కారం” అన్న కార్యక్రమంతో గుంకలాం లో ఈ మధ్యాహ్నం…01.15కు పేదల ఇండ్ల స్థలాలను పరిశీలించారు.2024లో జనసేన ప్రభుత్వం రావాలని గట్టిగా కోరంకోండని…తమ ప్రభుత్వం వస్తే.. ఇండ్ల నిర్మాణానికి ఇసుక, సిమెంట్ ఉచితంగా ఇస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
గుంకలాం లో జగనన్న ఇండ్ల నిర్మాణం.. దగ్గరుండి పరిశీలించామని…ఈ జగన్ ప్రభుత్వం ఏ ఒక్కరికీ న్యాయం చేయటం లేదన్నారు… పవన్ కల్యాణ్. మూడేళ్ళ అయినా.. ఈ ప్రభుత్వం… ఏ.ఒక్క సాగు ,తాగునీటి ప్రాజెక్టులను నిర్మించలేదన్నారు.2024లో జనసేన రావాలని కోరుకుంటే మీకు తగిన విధంగా ప్రభుత్వం ఉంటుందని పవన్ అన్నారు.అంతకు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్… గుంకలాం లో నిర్మితమవుతున్న ఇండ్ల ప్రదేశాన్ని… నాదెండ్ల మనోహర్ తో కలిసి పరిశీలించారు. తొలుత గుంకలాం చేరుకున్న పవన్… కాసేపు కారు ఆగిన చోటే వచ్చిన కారులోని ఉండిపోయారు.
ఎటువైపు వెళ్లాలో అన్న సందిగ్ధంలో జనసేన పార్టీ నేతలు సమాలోచనలు చేసారు. అయితే బందోబస్తు కై వచ్చిన ఎస్సీ ,ఎస్టీ సెల డీఎస్పీ శ్రీనివాస్ సీఐ.లతో దారి వెళ్లే యోచనలు చేసారు.. పవన తో వచ్చిన నేతలు. అంతలో నాదెండ్ల మనోహర్.. గుంకలాం లే అవుట్ పేపర్ ను పట్టుకొచ్చి…ఈ రకంగా వెళతామని డీఎస్పీ కి చెప్పడంతో… స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో తాడుతో.. వలయంగా ఏర్పడటంతో జనసేన అధ్యక్షుడు పవన్ కారు దిగి…స్థలాల పరిశీలన చేసారు. అనంతరం అక్కడ కొద్ది దూరంలో…2020 డిశెంబర్ 30 సీఎం జగన్ చేతులు మీదుగా ప్రారంభించబడిన పైలాన్ వద్ద లబ్ధిదారులనుద్దేశించి మాట్లాడారు.