గుంటూరు జిల్లా నరసరావుపేట కు తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్రా రాష్ట్రంకు తరలిస్తున్న అక్రమ మద్యం నిల్వలను ఆబ్కారీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నకరికల్లు మండల పరిధిలోని ఏకలవ్య విగ్రహం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా తెలంగాణ మద్యం బయటపడింది.
అక్రమ మద్యం తరలింపులో 14 మంది నిందితుల కాగా ఇప్పటికే 6 గురిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుండి ఒక ఐచెర్,టాటా ఏ.సి,ఆటో ,రెండు ద్విచక్ర వాహనాల స్వాదినం చేసుకున్నారు.
పట్టుబడిన మద్యం విలువ దాదాపు 22 లక్షల రూపాయల అని ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.