కృష్ణాజిల్లా కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంటికి సిఐడి అధికారులు నోటీసులు అంటించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోలు విషయమై సోదాలు నిర్వహించేందుకు వచ్చిన సిఐడి అధికారులు ఈ నోటీసులు అంటించి వెళ్లారు.
లక్ష్మీనారాయణ అల్లుడు దమ్మాలపాటి శ్రీనివాసరావు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అడ్వకేట్ జనరల్ గా పని చేశారు. ఇప్పుడు ఆయన ఇంటికి సర్చ్ నోటీస్ అంటించి వెళ్లారు. అధికారులు వచ్చే సమయానికి లక్ష్మీనారాయణ కుటుంబీకులు అందుబాటులో లేరు. లక్ష్మీనారాయణ కుమారుడు సీతారామరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్ గా పని చేశారు.