38.2 C
Hyderabad
April 28, 2024 22: 22 PM
Slider ముఖ్యంశాలు

రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు మృతి

#road accident

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే చిలిపి చెట్ మండలం రహీంగూడ తండాకు చెందిన రవి నాయక్ నర్సాపూర్‌లో జరిగే ఓ వివాహ కార్యక్రమానికి తన భార్య లీలతో కలిసి బైక్ పై నరసాపురం వస్తున్న క్రమంలో రెడ్డిపల్లి సమీపంలోనికి రాగానే నర్సాపూర్ వైపు వస్తున్న డీసీఎం రవి నాయక్ బైక్‌ను ఢీ కొట్టింది.

ఈ ఘటనలో రవి నాయక్‌తో పాటు లీలా అక్కడికక్కడే మృతి చెందారు. నర్సాపూర్‌లో నివాసం ఉంటున్న రవి నాయక్ కుటుంబం శివంపేట మండలం పిల్లుట్ల ప్రైమరీ స్కూల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. మృతునికి ఓ కుమారుడు ఓ కూతురు ఉన్నట్లు తెలిపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రవి నాయక్ తన కుటుంబంతో కలిసి సెలవులకని తన స్వగ్రామమైన రహీం గూడకు పెళ్లికి వస్తుండగా ప్రమాదంలో దంపతులు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.

Related posts

పుకార్ల ప్రమాదం నుంచి వ్యాక్సిన్లకు రక్షణ కావాలి

Satyam NEWS

అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి కోర్టు ఏర్పాటు హర్షణీయం

Bhavani

రెండేళ్ల పాలనా సంబరాలా..నవ్విపోదురుగాక..

Satyam NEWS

Leave a Comment