29.7 C
Hyderabad
April 29, 2024 09: 00 AM
Slider హైదరాబాద్

గణనాథుని ఆశీస్సులు ప్రజలందరు పై ఉండాలి

#gadwalvijayalaxmi

గణనాథుని ఆశీస్సులు ప్రజలందరు పై ఉండాలని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకాంక్షించారు. శనివారం మీర్పెట్ హెచ్ బీ కాలని డివిజన్ లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరై, కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వరరావు లతో కలిసి గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. తాము చేపట్టే కార్యక్రమాలకు ఎటువంటి విజ్ఞములు కలగకుండా కాపాడాలని వినాయకుని పూజిస్తే చేపట్టిన కార్యక్రమాలు విజయవంతవుతాయని మేయర్ అన్నారు.

ఈ కార్యక్రమం తిరుమల నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినది. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి. గంధం నాగేశ్వరరావు, యూత్ అసోసియేషన్ సభ్యులు దీపక్, అనూప్, నరేష్, అరవింద్, హర్ష, నాయక్, సచిన్, వెంకటేష్, లియో, సునీల్, రాంపాల్, ధీరజ్, చెర్రీ, మరియు పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

దేశాన్ని అమ్మే పనిలో మోడీ ప్రభుత్వం

Bhavani

శత చిత్ర దార్శనికుడికి నివాళులు

Satyam NEWS

కరోనా యాంటీ బాడీలతో పుట్టిన సింగపూర్ బిడ్డ

Satyam NEWS

Leave a Comment