పంచ భూతాల సాక్షిగా
మంచి చెడులు లాగా
వ్యాధి జరా మరణాలు
అందరికీ ఒకటే
మశూచో పొంగో ఆటలమ్మ నో
పట్నం గుండా
వ్యాధులు ప్రబలిన్నాడు
నిజానంగా
ప్రభువు చేతులెత్తి
ప్రజల మేలు కోరాడు
అంటు వ్యాధులు
అంటం దెవరికి
ప్రాణప్రదమైతే చాలు
దైవంగా ఆరాధించే
మంచి మనుషులున్న చోటు
ఔషధాన్ని ఆదిశక్తిని
జీవాత్మ బంధం చేశారు
మనిషై పుట్టినాంక
మత మేంచేస్తది
మనసు పెట్టి పిలువు
గోల్కొండ పలుకుతుంది
చార్మినార్ పులకిస్తున్నది
కడప స్పర్శించు
లాల్ దర్వాజ తెరచుకుంటున్నది
ఒక్కొక్క సుభా కుండ దొంతరల
అత్రాఫు బల్దా బోనమై ఉడికితే
బండారు బొట్టు వేపకోమ్మలుపూని
కలకత్తా కాళిక నాలుకలా అమ్మోరు
ఉట్టి ఊయల బయలెళ్లు తున్నది
కొరడాలు ఝళిపిస్తున్నది
ఆషాఢ మేఘమవుతున్న ది
పిల్లాపాపా పంటచేనూ తానై
చల్లని పవనాలు అలుకుతున్నది
పట్నంలష్కర్ బోనాలు
చేతిలో చేయేసి అభయమవుతున్నది.
డా.బెల్లంకొండ సంపత్ కుమార్ సికింద్రాబాద్, Cell.9908519151