భారతదేశ అగ్రగామి జీవితేతర బీమా కంపెనీల్లో ఒకటైన ఐసీఐసీఐ లాంబార్డ్ కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని అరి కట్టేందుకు ఒక విశిష్ట సీఎస్ఆర్ కార్యక్రమానికి నాంది పలికింది.
ఆరోగ్య సంరక్షణ రంగంలో తనకు గల అనుభవం, సంబంధాలను దృష్టిలో ఉంచుకొని అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అపోలో హెల్త్ & లైఫ్ స్టైల్ లిమిటెడ్ తో, మెట్రోపొలిస్ హెల్త్ కేర్ తో భాగస్వామి గా మారింది. ఈ కార్యక్రమంలో భాగంగా కోవిడ్ -19 అనుమానిత కేసులను పరీక్షించేందుకు అవసరమైన టెస్టింగ్ కిట్స్ తో యావత్ స్క్రీనింగ్ ప్రొసీ జర్ కు నిధులను సమకూర్చనుంది.
ఈ కార్యక్రమం కోసం సంస్థ రూ.5 కోట్లు వెచ్చించనుంది. ఇది సమాజం లోని అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చనుంది. టెస్టింగ్ కిట్, ఇంటి నుంచి శాంపిల్ సేకరణ, డయాగ్నోసిస్, టెస్ట్ రిజల్ట్ జనరేట్ చేయడం లాంటివి కలిపి కోవిడ్ -19 టెస్ట్ వ్యయం ప్రస్తుతం రూ.4,500 గా ఉంది.
ఇప్పటికే ఈ కార్యక్రమం కింద పేద వర్గాలకు చెందిన 11,000 మంది ప్రయోజనం పొందారు. వీరంతా కూడా వైరస్ లక్షణాలు కలిగి ప్రాధాన్యపూర్వకంగా టెస్ట్ లు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నవారే. అంతేగాకుండా టెస్టింగ్ కిట్స్ ధరలు తగ్గితే సమాజంలో మరెంతో మందికి ఈ కార్యక్రమం మేలు చేయనుంది.
అంత్యోదయ రేషన్ కార్డు, బీపీఎల్ రేషన్ కార్డ్ కలిగిన వారు ఈ కార్యక్రమం కింద ప్రయోజనం పొందేందుకు అర్హులు. ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ భార్గవ్ దాస్ గుప్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఈ సవాళ్ళ సమయంలో సమాజంలోని పేదలు కోవిడ్-19కు లోనయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు.