మునిసిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలీసుల లాఠీ చార్జిలో గాయపడిన వారిని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు పరామర్శించారు. ప్రశాంతంగా పోలింగ్ జరగాల్సిన కొల్లాపూర్ లో ఘర్షణలు జరిగి పోలీసులు లాఠీ చార్జి చేయడం శోచనీయమని ఆయన అన్నారు. అయితే ఎవరు ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఉండాలని ఆయన అన్నారు.
పోలీసుల లాఠీఛార్జీతో తీవ్ర గాయాల గురైన సాధారణ ప్రజలు వివిధ పార్టీల కార్యకర్తలు నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అదే విధంగా తీవ్ర గాయలపాలై చికిత్స పొంది ఇంటికి వెళ్లిన వారిని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు పట్టణంలోని వారి వారి ఇళ్లకు వెళ్లి నేరుగా పరామర్శించి వారికి ధైర్యం కల్పించారు. ఎవరు ఎన్ని అలజడులు సృష్టించిన గతంలో మాదిరిగానే ప్రతి ఒక్కరు సంయమనం తో ప్రశాంతగా ఉండాలని జూపల్లి పిలుపు నిచ్చారు.