హోంగార్డుల సంక్షేమంలో భాగంగా జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులకు తూర్పుగోదావరి జిల్లా ఎస్ పి M. రవీంద్రనాథ్ బాబు గుర్తింపు కార్డులను అందజేసారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ జిల్లాలో 993 మంది హోంగార్డులుగా విధులు నిర్వహిస్తున్నారని, వీరంతా పోలీసు శాఖలో ఒక భాగమని, శాంతిభద్రతల పర్యవేక్షణ, నేర నివారణ, ట్రాఫిక్ నియంత్రణలో కానిస్టేబుల్ లతో సమానంగా హోంగార్డులు కష్టపడుతూ విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు.
జిల్లాలోని హోంగార్డ్ లకు పోలీసులతో సమానంగా గుర్తింపునిచ్చేందుకు ఈ డిజిటల్ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని, దీనిలో భాగంగా ఈ రోజు 30 మంది హోంగార్డులకు గుర్తింపు కార్డులు అందచేశామని తెలిపారు. మిగిలిన హోంగార్డులకు కూడా కొన్ని రోజుల వ్యవధిలో అందచేస్తామని, దీనికి గాను హోంగార్డ్ RI కి తగు ఆదేశాలు జారీచేశామని ఎస్ పి తెలిపారు.