సెల్ఫీలు, ఫోటోలు దిగడానికి సరదా కొరకు ప్రజలు జలపాతాలు, అలుగు పారుతున్న చెరువులు, గోదావరి పరిసరాలకు వెళ్లడానికి వెళ్లకుండా పటిష్ట బందోబస్తు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు.
సరదా మాటున ప్రమాదం పొంచి ఉందని, అత్యుత్సాహం ప్రదర్శించి ఎవరైనా జిల్లా యంత్రాంగం ఆదేశాలు విస్మరించి ఫొటోలు, సెల్ఫీలు దిగడం, ఈతలకు వెళ్లడం, చూసేందుకు రావడం చేస్తే అలాంటి వారిపై పోలీస్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర గస్తీ చేపట్టాలని చెప్పారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల పాఠశాలలకు సెలవులు ప్రకటించినందున పిల్లలు ఇళ్ల నుండి బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ సూచించారు.