కడప జిల్లా సుండుపల్లి మండలం లోని తిమ్మసముద్రం పంచాయతీలోని ఉర్దూ హై స్కూల్ ను రాజంపేట శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి తనిఖీ చేశారు. జగనన్న గోరుముద్ద గురించి అడిగి తెలుసుకొని ఆ భోజనం నాణ్యతగా ఉందా లేదా అని తనిఖీ చేశారు. ఆకస్మిక తనిఖీ సందర్భంగా పిల్లలతో కలిసి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో మేడా విజయ్ శేఖర్ రెడ్డి, శివారెడ్డి, మాజీ ఎంపీపీ అజంతమ్మ ఆరం రెడ్డి అరుణ్ శ్రీనివాసులు రాయవరం రఫీ మడితడు ఇస్మాయిల్ బలరామరాజు మహేష్ రాజు చంద్రశేఖర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి జయరాం నాయుడు పించ రామస్వామి రెడ్డి శ్రీనువాసుల రెడ్డి తిమ్మసముద్రం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.