ములుగు జిల్లా కేంద్రంలో ఐ ఐ ఎఫ్ ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ సంస్థ నూతన బ్రాంచిని ములుగులో సిఐ గుంటి శ్రీధర్ ప్రారంభించినారు.
గోల్డ్ లోన్ వినియోగదారులకు మంచి సేవలు అందించి వారి ఆదరాభిమానాలు పొందాలని అన్నారు. ఐ ఐ ఎఫ్ ఎల్ సంస్థ శాఖలు ఇండియా పరిధిలో రెండు వేల పైగా శాఖల ద్వారా సేవలు అందిస్తుందని ఐ ఐ ఎఫ్ ఎల్ టేవిట్రీ మేనేజర్ బండి యాదగిరి అన్నారు.
బ్రాంచ్ మేనేజర్ సామల నాగరాజు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తామని అతి తక్కువ వడ్డీకే బంగారు ఆభరణాలపై లోన్స్ ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సిబ్బంది వేణు రంజిత్ శివ ప్రజలు పాల్గొన్నారు.