అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ దొరల చేతిలో దగా పడుతోంది. దొరల చేతిలో కబ్జాకు గురైన దళిత, గిరిజన, అణగారిన వర్గాల భూములను రక్షించాలంటే జర్నలిజం బతకాలి.! తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన జర్నలిస్టులారా మరో పోరాటానికి సిద్దమవుదాం అని తొలివెలుగు పిలుపునిచ్చింది.
ఈ మేరకు జూలై 1, గురువారం ఉదయం 10గంటలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల లో సదస్సు నిర్వహిస్తున్నారు.
మంచిర్యాల లోని ఫైర్ స్టేషన్ పక్కన ఉన్న సిపిఐ భవన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజు అత్యాచారానికి గురౌతున్న జర్నలిజం విముక్తి కోసం పోరాడుదాం.. జర్నలిస్టులారా రండి… కదలి రండి అంటూ తొలివెలుగు పిలుపునిచ్చింది.
ఉమ్మడి పది జిల్లాల్లో తెలంగాణ సీనియర్ జర్నలిస్టులు, పలు జర్నలిస్ట్ సంఘాల సహకారంతో తొలివెలుగు నిర్వహిస్తున్న గడీల్లో బందీ జర్నలిజం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని వారు పిలుపునిచ్చారు.