జోగులాంబ గద్వాల జిల్లా రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో 2023 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. గద్వాల పట్టణంలోని భీమ్ నగర్ లో గల రెడ్డి హాస్టల్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రెడ్డి సేవా సమితి అధ్యక్షులు సీతారాంరెడ్డి ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి సేవా సమితి సభ్యులు పెద్ద ఎత్తున హాజరై నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సీతారాంరెడ్డి మాట్లాడుతూ గద్వాలలో 2011లో ప్రారంభించిన రెడ్డి హాస్టల్లో రెడ్డి కులస్తులతో పాటు అన్ని కులాలకు చెందిన పేద విద్యార్థులకు వసతి కల్పించినట్లు తెలిపారు.
రెడ్డి సేవా సమితి తో పాటు యువజన సమితి మహిళా సమితి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందరి సమిష్టి కృషితో ఈ సంవత్సరం కల్యాణ మండపం కొరకు స్థల సేకరణ చేస్తామని తెలిపారు. త్వరలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని ఆయన తెలిపారు. ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 2018లో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం నేటి వరకు ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక కార్పస్ ఫండ్ మంజూరు చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల ఉపాధ్యక్షులు, రమ్య ఇండస్ట్రియల్ బండ్ల రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి జగదీశ్వర్ రెడ్డి, కోశాధికారి టి కృష్ణారెడ్డి, మల్దకల్ మండలం జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ విక్రమ్ సింహారెడ్డి, సంఘాల అయ్యప్ప రెడ్డి, సోమనాద్రి కాలేజీ భాస్కర్ రెడ్డి, రంగారెడ్డి, రెడ్డి యువ సేవాసమితి అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవి కుమార్ రెడ్డి కోశాధికారి వై మల్లికార్జున్రెడ్డి మరియు మారుతి సప్లయర్ శ్రీనివాస్ రెడ్డి, చక్రధర్ రెడ్డి, కొత్తపల్లి అశోక్ రెడ్డి ఉద్యోగస్తులు సూర్య ప్రకాష్ రెడ్డి రాధాకృష్ణారెడ్డి రిటైర్డ్ ఎంప్లాయ్ కృష్ణారెడ్డి, మరియు తదితరులు పాల్గొన్నారు.