ప్రొద్దుటూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి జి.ప్రవీణ్ కుమార్ రెడ్డి రాత్రి సబ్ జైలు నుండి విడుదల కావడంతో ఆయనను శనివారం కోగటంలోని స్వగృహంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని పోలీసులు వైసీపీ నాయకుల కన్నా కేసులు కట్టడానికి అత్యుత్సాహం చూపిస్తున్నారని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు.
ఇటీవల కాలంలో కమలాపురంలో జరిగిన ఓ కేసులో 324 కేసు నమోదు చేసి వారంరోజుల తరువాత 307గా మార్చారన్నారు. పై అధికారులకు చెప్పినప్పటికీ ఎటువంటి స్పందన లేదని మండిపడ్డారు.
ఎన్ని కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నించినా వైసీపీకి లొంగే నాయకులు ఎవరూ లేరన్నారు. ఇలాంటి వాటిపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ఎక్కువ దృష్టి పెడుతున్నారన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు.