33.7 C
Hyderabad
April 29, 2024 00: 46 AM
Slider కడప

అక్రమ కేసులకు భయపడేవారు ఎవ్వరూ లేరు

ప్రొద్దుటూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి జి.ప్రవీణ్ కుమార్ రెడ్డి రాత్రి సబ్ జైలు నుండి విడుదల కావడంతో ఆయనను శనివారం కోగటంలోని స్వగృహంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని పోలీసులు వైసీపీ నాయకుల కన్నా కేసులు కట్టడానికి అత్యుత్సాహం చూపిస్తున్నారని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు.

ఇటీవల కాలంలో కమలాపురంలో జరిగిన ఓ కేసులో 324 కేసు నమోదు చేసి వారంరోజుల తరువాత 307గా మార్చారన్నారు. పై అధికారులకు చెప్పినప్పటికీ ఎటువంటి స్పందన లేదని మండిపడ్డారు.

ఎన్ని కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నించినా వైసీపీకి లొంగే నాయకులు ఎవరూ లేరన్నారు. ఇలాంటి వాటిపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ఎక్కువ దృష్టి పెడుతున్నారన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు.

Related posts

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని తేలిపోయింది

Satyam NEWS

థాయ్ బాక్సింగ్ తో క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్

Satyam NEWS

ఓటర్ నమోదుకు 8 వరకు గడువు

Murali Krishna

Leave a Comment