కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద భారీ ఎత్తున అక్రమ మద్యం పట్టుబడింది. AP 29 R 7200 నెంబర్ గల కారు లో 41 బాక్సులు, AP 09 BG 1390 కారు లో 53 బాక్సులు మొత్తం 94 బాక్సుల కర్ణాటక మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఇంచార్జి ఏ ఈ ఎస్ రాజశేఖర్ గౌడ్ పర్యవేక్షణ లో SEB ఇన్స్పెక్టర్ మంజుల SI ప్రవీణ్ కుమార్ నాయక్, DTF SI స్వామినాథన్ సిబ్బంది కలసి వాహనాలను తనిఖీ చేయడంతో ఈ విషయం బయటపడింది.
కర్నూల్ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద మంగళవారం తెల్లవారు జామున 4 గంటలకు జరిపిన తనిఖీల్లో కర్ణాటక నుంచి అక్రమ మద్యం పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో సిబ్బంది ఆన్సర్, కరుణాకర్ పాల్గొన్నారు. కార్ డ్రైవర్లు ఇద్దరు కార్ వదిలి పారిపోయారు. పట్టుబడిన కార్లను మద్యం ను తదుపరి చర్యల నిమిత్తం కర్నూల్ SEB పోలీసు స్టేషన్ కు తదుపరి విచారణ నిమిత్తం పంపడమైనది.
మధు జర్నలిస్ట్