ఛత్తీస్గఢ్లో కలుషిత ఆహారం తిన్న 28 మంది జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. సీఆర్పీఎఫ్ 150వ బెటాలియన్కు చెందిన ఈ జవాన్లు పాత ఆవాలు నూనెతో వండిన ఆహారం తిని అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. సుక్మా జిల్లాలోని చింతగుప్పలో ఈ ఘటన జరిగింది. కాగా జవాన్లను సీఆర్పీఎఫ్ ఫీల్డ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జవాన్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై కమాండెంట్ రాజేశ్యాదవ్ విచారణకు ఆదేశించారు.