కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో ఆరోపించారు. వివిధ ప్రావిన్సులకు సహాయం చేయడంలో ఫెడరల్ ప్రభుత్వం విఫలం కావడం వల్లే పాకిస్తాన్ లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని ఆయన అన్నారు.
సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా తమ ప్రావిన్స్ లో కరోనా పరిస్థితిని పార్టీ చైర్మన్ కు వివరించారు. ఫెడరల్ ప్రభుత్వం ఎలాంటి సాయం అందించకపోయినా తాము సమర్ధంగా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేశామని ఆయన వివరించారు. సింధ్ ప్రభుత్వం సత్వమైన, పటిష్టమైన చర్యలు తీసుకుని ఉండకపోతే దేశం మరింత కష్టాల్లోకి వెళ్లి ఉండేదని బిలావల్ భుట్టో అన్నారు.