30.7 C
Hyderabad
April 29, 2024 03: 49 AM
Slider ముఖ్యంశాలు

ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో రూ. 114 కోట్ల స్కామ్ : మంత్రి అమర్నాథ్

#Minister Amarnath

ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో రూ. 114 కోట్ల స్కామ్ జరిగిందని, చంద్రబాబే ఈ స్కామ్ కు అధ్యుడు అని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ పై చర్చ జరిగింది. టెండర్ల సమయం నుంచి ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని వివరించారు.

చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీలకు కాంట్రాక్ట్ కట్టబెట్టారన్నారు. టెరాస్టాఫ్ట్ కంపెనీకి అర్హత లేకున్నా కట్టబెట్టారని, చంద్రబాబు హయాంలో ఒక్క ఫైబర్ నెట్ ప్రాజెక్టుతోనే రూ.114 కోట్లు కొట్టేశారని మంత్రి ఆరోపించారు. బ్లాక్ లిస్ట్ లోని కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.110 కోట్లు నష్టం వాటిల్లిందని సభకు మంత్రి వివరించారు.

Related posts

సిమెంటు కర్మాగారాలలో 8వ వేతన ఒప్పందం అమలుచేయాలి: సిఐటియు

Satyam NEWS

తిరుపతిలో మద్యం దుకాణాలు మూసివేయాలి

Satyam NEWS

వనపర్తి జిల్లా పోలీసుల ప్రజావాణిలో 10 ఫిర్యాదులు

Satyam NEWS

Leave a Comment