38.2 C
Hyderabad
April 28, 2024 22: 06 PM
Slider ఖమ్మం

పేదలకు మెరుగైన వైద్య సేవలు

#District Collector V.P

పేదలకు మెరుగైన సేవలు అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపి ని పరిశీలించారు. ఫార్మసీ డిస్పెన్సరీ ని పరిశీలించారు. మందులు ఇచ్చి, స్లిప్పులు తీసుకుంటున్నారని రోగులకు స్లిప్పులు ఇవ్వడం లేదని తెలుపగా, రోగులకు మందులతోపాటు స్లిప్పులు ఇవ్వాలని, బయట మందులు కొనకుండా, అన్ని మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు.

ఆరోగ్య మహిళ విభాగాన్ని తనిఖీ చేసి, రిపోర్టులు పరిశీలించారు. రోజుకు సరాసరిగా 10 రిపోర్టులు చేస్తున్నట్లు తెలుపగా, రోజుకు 25 కు పెంచాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Related posts

ఆచార్యుడు, ఆరాధ్యుడు

Satyam NEWS

ప్రజల్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోను

Satyam NEWS

బ్లాక్ ఫంగస్ ఔషధాలు జనఔషధి దుకాణాల్లో పెట్టాలి

Satyam NEWS

Leave a Comment