ఉప్పల్లో బండారి లక్ష్మారెడ్డి గెలుపు ఖాయం అని, అభివృద్ధి పథకాలే బండారి లక్ష్మారెడ్డి గెలుపుకు దోహద పడతాయని రామంతాపూర్ మాజీ కార్పరేటర్ గంథం జొత్స్నా నాగేశ్వరావు అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఉప్పల్ ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ గంధం జోష్ణ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం రామంతపూర్ లోని నేహ్రూనగర్ కాలనీ లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంధం చూస్తున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలు కు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో వలసలు గా చేరుతున్నారని అన్నారు. ఉప్పల్ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు,మధుసూదన్ రెడ్డి,తుట్ నరసింహ, శ్రీనివాస్ రెడ్డి,వనం పల్లి శ్రీనివాస్ రెడ్డి,ఆలే రమేష్,అజయ్ కుమార్ ,రాజు ,శ్రీకాంత్ ,చందు,మంజులా, స్వప్నా ,సబితా,సంధ్య ,వెంకటరమణ,శివ తదితరులు ఈ ప్రచారం లో పాల్గోన్నారు .
సత్యం న్యూస్,మేడ్చల్ జిల్లా