సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) మరణించిన జవాన్ల కుటుంబాలకు అందించే ఎక్స్-గ్రేషియా మొత్తాన్ని పెంచింది. ఇక నుంచి వారి కుటుంబాలకు రూ.35 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం యుద్ధంలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ఇప్పటివరకు ఇస్తున్న రూ.21.5 లక్షలను పెంచామని ఇప్పుడు రూ.35 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని పారామిలటరీ అధికారులు తెలిపారు.
అదేవిధంగా సర్వీస్లో ఉండగా ప్రమాదం, ఆత్మహత్య లేదా అనారోగ్యం వంటి ఇతర కారణాల వల్ల మరణించిన జవాన్ల కుటుంబాలకు రూ.16.5 లక్షలకు బదులుగా రూ.25 లక్షలు అందజేయనున్నారు. సెప్టెంబర్లో జరిగిన పారామిలటరీ దళం పాలకమండలి వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.