37.2 C
Hyderabad
April 26, 2024 20: 46 PM
Slider జాతీయం

సీఆర్ఫీఎఫ్ అమరులకు రూ.35 లక్షల ఎక్స్ గ్రేషియా

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) మరణించిన జవాన్ల కుటుంబాలకు అందించే ఎక్స్-గ్రేషియా మొత్తాన్ని పెంచింది. ఇక నుంచి వారి కుటుంబాలకు రూ.35 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం యుద్ధంలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ఇప్పటివరకు ఇస్తున్న రూ.21.5 లక్షలను పెంచామని ఇప్పుడు రూ.35 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని పారామిలటరీ అధికారులు తెలిపారు.

అదేవిధంగా సర్వీస్‌లో ఉండగా ప్రమాదం, ఆత్మహత్య లేదా అనారోగ్యం వంటి ఇతర కారణాల వల్ల మరణించిన జవాన్ల కుటుంబాలకు రూ.16.5 లక్షలకు బదులుగా రూ.25 లక్షలు అందజేయనున్నారు. సెప్టెంబర్‌లో జరిగిన పారామిలటరీ దళం పాలకమండలి వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Related posts

దమ్ముంటే నాకు సంకెళ్లు వెయ్

Bhavani

వంశీచంద్ రెడ్డికి టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ అభినందనలు

Satyam NEWS

థియేట‌ర్ల రీ ఓపెనింగ్ జీవో జారీ

Sub Editor

Leave a Comment