కరోనా వైరస్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకునేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించిందని కార్వాన్ ఏ ఇస్లామీ ఇంటర్నేషనల్ చైర్మన్ గులాం రసూల్ హమి అన్నారు. తమది కాని కాశ్మీర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి భారత్ పధకం రచిస్తున్నదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఇప్పటికే దాదాపు మూడు లక్షల మంది ఆర్ఎస్ఎస్, బిజెపి, విశ్వహిందూ పరిషత్ కు చెందిన మూడు లక్షల మంది హిందూ ఉగ్రవాదులకు కాశ్మీర్ పౌరసత్వం ఇచ్చేశారని ఆయన అన్నారు. అంతర్జాతీయ సమాజం ముందుకు ఈ అంశాన్ని తీసుకువెళతామని గులామ్ రసూల్ అన్నారు. భారత్ అవలంబిస్తున్న కాశ్మీర్ వ్యతిరేక చర్యలను అందరూ ఖండించాలని ఆయన కోరారు.