సింగపూర్ నుంచి భారత్కు వచ్చే ఎన్నారైలు, అంతర్జాతీయ ప్రయాణికులకు ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించిన అట్ రిస్క్ దేశాల జాబితాలో నుంచి సింగపూర్ను తొలగించింది. ఇక అదే సమయంలో ఆ జాబితాలో కొత్తగా టాంజానియా, ఘనా దేశాలను చేర్చింది.
సౌతాఫ్రికా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు మరింతగా పెంచారు. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్పోర్టులలో కోవిడ్ పరీక్షలు, ఆ తర్వాత క్వారంటైన్ నిబంధనలు విధిస్తున్నాయి.
ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఉన్న దేశాల జాబితాను అట్రిస్క్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అట్ రిస్క్ జాబితాలో ముందుగా సింగపూర్, ఇజ్రాయిన్, జింబాబ్వే, న్యూజిలాండ్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, యూకే, ఇజ్రాయిల్, హాంగ్కాంగ్ దేశాలు ఉన్నాయి.
తాజాగా ఈ జాబితాను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఈ జాబితా నుంచి సింగపూర్ దేశాన్ని తొలగించింది. ఇక నిబంధనల ప్రకారం.. ఇక నుంచి సింగపూర్ నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాలలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.