విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో బుధవారం నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించేందుకు ఆలయ వైదిక కమిటీ ఏర్పాట్లు చేసింది.
తొలి రోజు తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ, అనంతరం అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ ఉంటుంది. పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.