సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ లో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణం కోసం భూ పరిశీలన జరిగింది. మఠంపల్లి మండలం రఘునాథ పాలెం,గుండ్లపలి గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం కోసం ప్రభుత్వ భూములను స్థానిక శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పరిశీలించారు.
వీరితో పాటు టి ఎస్ ఐఐసి యండి నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మన్నెం శ్రీనివాస్ రెడ్డి, గుండా బ్రహ్మరెడ్డి,ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్,ఇతర అధికారులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.