కడప జిల్లా రాయచోటి టీడీపీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఖదర్ బాష పై వైసీపీ నేతలు కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఖాదర్ బాష తీవ్రంగా గాయపడగా రక్తపు మడుగు ఏర్పడింది. విషయం తెలుసుకొని ఘటన స్థలానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి హుటాహుటిన చేరుకున్నారు.
రాయచోటి ఇంచార్జి రమేష్ రెడ్డి కూడా ఆయనను పరామర్శించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. దాడి జరుగుతున్న సమయంలో ప్రేక్షక పాత్ర వహించిన స్థానిక పోలీసుల చర్యలను టీడీపీ నేతలు ఖండించారు. ఇదేం పద్ధతని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తనపై జరిగిన దాడిని ఖాదర్ బాషా పోలీసులు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.