పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. మే 6 వ తేదీ నుంచి ప్రధమ సంవత్సరం , 7 వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించనున్నారు. జె ఈఈ పరీక్షల షెడ్యూల్ ను మార్చిన కారణంగా ఇంటర్ షెడ్యూల్ ను కూడా మార్చారు. కాగా మొదటి ఏడాది పరీక్షలు మే 6 వ తేదీ నుండి 23 వ తేదీ వరకు, రెండవ ఏడాది పరీక్షలు మే 7 వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరుగుతాయి. అంతకు ముందే రెండవ ఏడాది విద్యార్ధులకు ప్రాక్టికల్స్ పూర్తి చేస్తారు. అలాగే పరీక్షల నిర్వహణకు అన్నీ ఏర్పాట్లు చేయాలని ఇంటర్మీడియట్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
previous post
next post