శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్న డా . గుండబాల మోహన్ కు తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలోని శ్రీకరీ ఫౌండేషన్ ఉగాది పురస్కారం అందచేసింది. విద్యార్థిని విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతూ సమాజానికి సేవలు అందిస్తున్న సందర్భంగా తనకు ఈ పురస్కారాన్ని అందజేశారని గుండబాల మోహన్ తెలిపారు.
శ్రీకరీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.మెట్టకాడ శ్యామ్ సుందర్, తెలంగాణ బిసి సభ రాష్ట్ర అధ్యక్షుడు ఎం శ్రీనివాసరావు, విశిష్ట అతిథులుగా సినీ నటుడు షాన్ సల్మాన్, సినీ గాయకురాలు ప్రజ్ఞా నాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ పురస్కారం ఆయనకు లభించడం పట్ల శ్రీకాకుళం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ సభ్యులు యమ్. వి. రమణ యమ్. సాంబమూర్తి, రాజారావు, నిర్మల్ కృష్ణ, బడి. రమణ, బి. నారాయణ, తవిటయ్య, హరి, వై. వి .పోలినాయుడు, సతీష్ రాయుడు, హరీష్ రాయుడు, ఎమ్మెస్సీ. శేఖర్, మాధవరావు, పురుషోత్తం,సుశీల, రోజా, బి. రమేష్ ఎల్ .దిలీప్, వై. రామారావు, కె .నరేష్, సిహెచ్. రాజేశ్వరి, సిహెచ్. శ్రీనివాసరావు, మధు, బాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా జిల్లా క్రీడా ప్రాధికార క సంస్థ అధికారులు బడి శ్రీనివాసరావు, డా.కె.శ్రీధర్, పెద్దపాడు వెయిట్ లిఫ్టింగ్ కోచ్ అప్పన్న, కుస్తీ ఆటలు కోచ్ బీ .గోవిందు శుభాకాంక్షలు తెలిపారు.