సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హెల్త్ అండ్ మెడికల్ యూనియన్ భవనంలో ఐ ఎన్ టి యు సి మహిళా విస్తృత సమావేశం జరిగింది.
జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇంటి అచ్చమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ ఐ ఎన్ టి యు సి కార్యదర్శి ఆర్ డి చంద్రశేఖర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో ఐ ఎన్ యు సి ని బలోపేతం చేస్తూ సంఘటిత, అసంఘటిత కార్మిక రంగాల్లోని మహిళా కార్మికుల యొక్క భద్రత కొరకు ప్రభుత్వాలు మరిన్ని చట్టాలను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని, గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలలో కూడా ఉపాధి హామీ పథకాన్ని ఎక్కువగా మహిళా లోకం వినియోగించుకునే విధంగా పేదలు బాగుపడే విధంగా ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలలో కూడా అమలు చేయాలని అన్నారు.భవన ఇతర రంగాల కార్మికులలో అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఐఎన్ టియు సి కార్యనిర్వాహక అధ్యక్షుడు కొండపల్లి సాగర్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు వల్దాసు శ్రీనివాస్,మెడికల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మనోజ్ రెడ్డి,ఆలేటి మాణిక్యం, పోతన బోయిన రామ్మూర్తి,మేళ్లచెరువు ముక్కంటి,చప్పిడి సావిత్రి,లక్ష్మీ,గడ్డం వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్,హుజూర్ నగర్