38.2 C
Hyderabad
April 29, 2024 20: 08 PM
Slider ముఖ్యంశాలు

మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐ‌టి రైడ్స్‌

#itraids

రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇల్లు, బంధువులు, సన్నిహితుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఒకేసారి 50 బృందాలతో సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లా రెడ్డి కాలేజీల్లో సోదాలు చేస్స్తున్నారు.  మల్లారెడ్డి కూతురు, కొడుకు, అల్లుళ్ళ నివాసాలతో పాటు  మల్లా రెడ్డి  తమ్ముళ్ల నివాసాలపై సోదాలు జరుగుతున్నాయి. 50 టీమ్స్ సహాయం తో సోదాలు జరుగుతుండగా కొంపల్లి లోని విల్లాలో నివాసం ఉంటున్న మహేందర్ రెడ్డి ఇంటిపై దాడిలో యెక్కువ మంది పాల్గొన్నట్లు సమాచారం.  ఓకే నెలలో ముగ్గురు మంత్రులు పై ఐటీ రైడ్స్‌ జరగటం గమనార్హం.  హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 50 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు జరుగుతుండగా తెరాస నేతల్లో గుబులు మొదలైంది. మొత్తం 50 బృందాలు ఏకకాలంలో ఆయన కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, నివాసాలపై దాడులు నిర్వహిస్తున్నారు.

Related posts

మాండూస్ తుపాను పై సత్యం న్యూస్.నెట్ తో డీఆర్ఓ ఏమన్నారంటే….

Bhavani

అగైన్ ఫైర్:జామియా ఇస్లామియా వద్ద కాల్పుల కలకలం

Satyam NEWS

ఈ చక్కని కుటుంబం శ్వాస ఆగిపోయింది…….

Satyam NEWS

Leave a Comment