31.7 C
Hyderabad
May 2, 2024 08: 10 AM
Slider కడప

కడప జిల్లా బద్వేలు లో జగనన్న వసతి దీవెన

Badwel 24

బద్వేలు నియోజకవర్గ స్థాయి లో బద్వేలులో సాయి భరత్ కళ్యాణ మండపం లో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పద్మజ అధ్యక్షతన  జరిగిన “జగనన్న వసతి దీవెన” ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బద్వేలు శాసనసభ్యులు డా వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

ఆరు కోట్ల రూపాయల “జగనన్న వసతి దీవెన” మెగా చెక్కును విడుదల చేసి, విద్యార్థుల తల్లులకు “జగనన్న వసతి దీవెన” కార్డులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి  సందేశాన్ని  బి కోడూరు మండల ప్రత్యేక అధికారి మొగిలిచెండు సురేశ్ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో బి కోడూరు ఎంపీడీవో ఉమా మహేశ్వరరావు,తాహసిల్దార్ మధురవాణి  పాల్గొన్నారు.

Related posts

ప్రయాణీకులు ఆదరణ పొందడానికి ప్రయత్నించాలి

Satyam NEWS

గోవింద మొబైల్ యాప్‌లోనూ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్లు

Satyam NEWS

మదర్ టంగ్: మాతృభాషతో సంపూర్ణ మానసిక వికాసం

Satyam NEWS

Leave a Comment