బద్వేలు నియోజకవర్గ స్థాయి లో బద్వేలులో సాయి భరత్ కళ్యాణ మండపం లో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పద్మజ అధ్యక్షతన జరిగిన “జగనన్న వసతి దీవెన” ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బద్వేలు శాసనసభ్యులు డా వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
ఆరు కోట్ల రూపాయల “జగనన్న వసతి దీవెన” మెగా చెక్కును విడుదల చేసి, విద్యార్థుల తల్లులకు “జగనన్న వసతి దీవెన” కార్డులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సందేశాన్ని బి కోడూరు మండల ప్రత్యేక అధికారి మొగిలిచెండు సురేశ్ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో బి కోడూరు ఎంపీడీవో ఉమా మహేశ్వరరావు,తాహసిల్దార్ మధురవాణి పాల్గొన్నారు.