40.2 C
Hyderabad
May 1, 2024 16: 11 PM
Slider చిత్తూరు

జడ్జిమెంట్: లాక్ డౌన్ ఉల్లంఘనకు జైలు శిక్ష

piler jail

లాక్ డౌన్ ను తేలిగ్గా తీసుకుంటున్న వారికి ఇది ఒక గుణపాఠం. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశం మొత్తం 21 రోజుల లాక్ డౌన్ కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని చాలా మంది ఉల్లంఘిస్తున్నారు. అలాగే చిత్తూరు జిల్లా పీలేరులో కూడా లాక్ డౌన్ నిబంధనలను కొందరు ఉల్లంఘించారు.

ఇలా ఉల్లంఘించిన వారిపై పీలేరు పోలీసులు కేసులు నమోదు చేశారు. కొందరు ఆటోలు కూడా నడిపారు. వీరందరిపైనా పీలేరు అర్బన్ సి.ఐ కేసులు నమోదు చేసి పీలేరు కోర్టులో హాజరు పరచగా వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించారు. దాంతో వారందరిని కారాగారానికి తరలించారు.

Related posts

కరణం బలరాం కుమార్తె పట్ల ఓ డాక్టర్ ఓవరాక్షన్

Satyam NEWS

మేనకా గాంధీ అనుచిత వ్యాఖ్యలకు పశువైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన

Satyam NEWS

బిచ్కుందలో పోలీసు అమరవీరుల దినోత్సవం

Satyam NEWS

Leave a Comment