కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో నేడు తెలంగాణ పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా బిచ్కుంద పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్త బస్టాండ్ ప్రాంతం వద్ద మానవహారం ఏర్పాటు చేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్బంగా బిచ్కుంద వలయ అధికారి శోభన్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసు వీరులకు జోహార్లు అర్పించారు. భద్రత విషయంలో పోలీసులు ఎంతటి త్యాగానికైనా ముందుంటారన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసు అధికారులను గౌరవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో వలయ అధికారితోపాటు ఎస్ఐ సత్యనారాయణ ,శిక్షణ ఎస్సైలు సురేష్, గంగాధర్, ఏఎస్ఐ వెంకట్ కుమార్తో పాటు పోలీసు,సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. జీ.లాలయ్య, సత్యం న్యూస్ రిపోర్టర్, జుక్కల్ నియోజకవర్గం