27.7 C
Hyderabad
April 26, 2024 06: 27 AM
Slider నిజామాబాద్

బిచ్కుందలో పోలీసు అమరవీరుల దినోత్సవం

#bichkundapolice

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో నేడు తెలంగాణ పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా బిచ్కుంద పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్త బస్టాండ్ ప్రాంతం వద్ద మానవహారం ఏర్పాటు చేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్బంగా బిచ్కుంద వలయ అధికారి శోభన్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసు వీరులకు జోహార్లు అర్పించారు. భద్రత విషయంలో పోలీసులు ఎంతటి త్యాగానికైనా ముందుంటారన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసు అధికారులను గౌరవించాలన్నారు.

ఈ కార్యక్రమంలో వలయ అధికారితోపాటు ఎస్ఐ సత్యనారాయణ ,శిక్షణ ఎస్సైలు సురేష్, గంగాధర్, ఏఎస్ఐ వెంకట్ కుమార్తో పాటు పోలీసు,సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. జీ.లాలయ్య, సత్యం న్యూస్ రిపోర్టర్, జుక్కల్ నియోజకవర్గం

Related posts

రేపటి నుండి పాల్వాయిలో చింతలముని నల్లారెడ్డి బ్రహ్మోత్సవాలు

Bhavani

ఘనంగా మహేశ్ బాబు సోదరి పుట్టిన రోజు

Satyam NEWS

ప్రొఫెసర్ కోదండరామ్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Satyam NEWS

Leave a Comment