జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. శ్రీనగర్లోని హర్వాన్ ప్రాంతంలో భద్రతా బలగాలు చేపట్టిన ఎన్కౌంటర్లో పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. ఇటీవల బందిపొరలో ఇద్దరు పోలీసులను హతమార్చడంతోపాటు పలు ఉగ్రవాద ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తిగా గుర్తించారు.
హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించమని పోలీసులు తెలిపారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్కౌంటర్గా మారిందని చెప్పారు.
కాశ్మీర్ లోయలో కొద్ది నిమిషాల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు ఉగ్రవాద ఘటనల్లో ఒక పౌరుడు, ఒక పోలీసు మరణించారు. ఒకవైపు, దక్షిణ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని బిజ్బెహరా ప్రాంతంలో జరిగిన దాడిలో శ్రీనగర్లోని నవాకడల్లో ఉగ్రవాదులు ఒక పౌరుడిని కాల్చి చంపగా, అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గాయపడ్డారు.