పిల్లల్లో కరోనాపై బ్రిటన్లో కొత్త పరిశోధన అధ్యయనం వెలువడింది. పెద్దల కంటే 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు. దీంతో పిల్లలకు టీకాలు వేయడం చాలా ముఖ్యమని చెప్పారు.
పరిశోధనలో భాగంగా 97వేల కరోనా నమూనాలను పరీక్షించారు. ఈ నమూనాలను నవంబర్ 23 నుంచి డిసెంబర్ 14 మధ్య తీసుకున్నారు. పరిశోధన అధ్యయనంలో ప్రాథమిక పాఠశాల పిల్లలలో 4.47 శాతం మందిలో కరోనా వైరస్ నిర్ధారించారు. అయితే ఈ సంఖ్య దేశవ్యాప్తంగా 1.41 శాతం మాత్రమే.