33.7 C
Hyderabad
April 29, 2024 23: 50 PM
Slider నల్గొండ

పలువురికి ఆదర్శంగా జనచైతన్య ట్రస్ట్

#Suryapet District

పేదలకు సేవ చేయాలని ఆలోచనతో జనసేన పార్టీ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం కార్యనిర్వాహకుడు, సరికొప్పుల నాగేశ్వరరావు,విజయలక్ష్మి కూతురు చైత్ర పుట్టినరోజు సందర్భంగా జనచైతన్య ట్రస్ట్ ని సంప్రదించి 25 కేజీల బియ్యం,నిత్యావసర సరుకులు జనచైతన్య ట్రస్ట్ కి డొనేషన్ గా అందజేశారు.


హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల 15వ,వార్డుకి చెందిన కుడితేటి నాగార్జున కొన్ని రోజుల క్రితం చెట్టుపై నుండి పడటంతో వెన్నుపూస ఆపరేషన్ జరిగింది.ఆ కుటుంబం ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న జనచైతన్య ట్రస్ట్ సభ్యులు గురువారం 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు కుటుంబానికి అందించారు.


ఈ సందర్భంగా జనచైతన్య ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ జనసేన పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గం కార్యనిర్వాహకుడు సరికొప్పుల నాగేశ్వరరావు ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ జీవితంలోనీ సంతోష క్షణాలను మరొక పేద కుంటుంబానికి సాయం చేస్తూ ఉండాలని,మధుర స్మృతిగా నలుగురికి ఆదర్శంగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనచైతన్య ట్రస్ట్ ఫౌండర్ పినపారాళ్ల వంశీ,దగ్గుపాటి రమేష్, కాశీవిశ్వనాథ్,సిపాయి నాయక్, బాబురావు, అశోక్,కొల్లపూడి చంటి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

కృష్ణా నదిలో జస్టిస్ ఫర్ దిశ అస్థికల నిమజ్జనం

Satyam NEWS

విద్వేషపూరిత ప్రసంగాలపై పాక్ ఆందోళన

Sub Editor

ఓయూ సమస్యలను పరిష్కరించాలి: బిజెపి ఉపాధ్యక్షులు ఎన్.వి.ఎస్.ఎస్

Satyam NEWS

Leave a Comment