కడపజిల్లా రాజంపేట మండలం అకేపాటి ఎస్టేట్ లో గురువారం రాజంపేట మాజీ శాసన సభ్యులు అకేపాటి అమర్ నాథ రెడ్డి ని కలిసి జిల్లా పరిషత్తు చైర్మన్ గా ఈనెల 25న ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా రాజంపేట జనసేన నాయకురాలు పత్తి పాటి కుసుమ కుమారి అభినందించారు. పత్తి పాటి కుసుమ కుమారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆపార్టీలో కొనసాగి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి రాకపోవడంతో చివరి క్షణం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో రాజంపేట జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమె ప్రస్తుతం జనసేన లోనే కొనసాగుతున్నా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
previous post