నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ప్రజల భాగస్వామ్య సంస్థ (పిబిఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి వృద్ధులు , వృద్ధాశ్రమం నిర్వాహకులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జయశంకర్ సార్ స్ఫూర్తి తోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఆయన మన రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకులు వెంకటయ్య, మేనేజర్ మల్లేష్, కౌన్సిలర్ పరుశరాములు, సిబ్బంది, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.