టీడీపీ పాలనలోనే ఎస్సీల అభివృద్ధి జరిగిందని పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ పేర్కొన్నారు. స్థానిక నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దళిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరుకే కార్పొరేషన్ కాని ఏ ఒక్కరికి కూడా రుణాలను అందజేయలేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు రుణాలను,వాహనాలు అందించిన ఘనత చంద్రబాబునాయుడుకె దక్కిందన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇంత వరకు ఎస్సీలకు సంబంధించిన ఏ ఒక్క పని చేయలేదన్నారు.
మూడేళ్ల వైసీపీ పాలనలో దళితుల పై వందలాది దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం, హత్యలు,ఉద్యోగాలు కోల్పోవడం,దళితుల భూములు లాక్కోవడం వంటి ఘటనలకు లెక్కే లేదన్నారు. ప్రశ్నించిన దళితుల పైనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం ఒక్క వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు.దళితులకు న్యాయం జరగాలంటే జగనను గద్దె దింపి టీడీపీని అధికారంలోకి తేవాలని, ఆ బాధ్యత దళితుల భుజ స్కందాల పై ఉందని డా౹౹చదలవాడ తెలిపారు.
ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మనుకొండ శివప్రసాద్,నల్లపాటి రామచంద్ర ప్రసాద్,కొట్ట కిరణ్,మొండితోక రామారావు, కొమ్మలపాటి ప్రభాకర్,కుంపటి రవి,పెరికాల రాయప్ప,చింతిరాల బాలు,గన్నెపొగు కుమార్,గిద్దల వెంకటేశ్వర్లు,గర్నెపుడి నాయుడు,కొండెపోగు సునీల్, బంగారం, దాసు,మధు,మల్లవరపు శ్యామ్,కాల్వ చిన్న,గినేపూడి ఏసురత్నం,అన్నపర్తి ప్రసాద్,సాగర్,కోటేశ్వరరావు మరియు ఎస్సీ సెల్ కమిటీ సబ్యులు,టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.