అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికార యంత్రాంగం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భావాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ అన్నారు.
ముఖ్యంగా పర్యావరణ మార్పులకు సంబంధించిన వ్యవహారాలలో, మనీ లాండరింగ్ విషయంలో, అవినీతి అరికట్టడం లాంటి వ్యవహారాలలో జో బైడెన్ యంత్రాంగం ఇమ్రాన్ ఖాన్ గతంలో చెప్పిన విషయాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం హర్షణీయమని ఆయన అన్నారు.
అమెరికా సహాయ కార్యదర్శి అంటోనీ బ్లింకెన్ నిన్న ఖురేషీతో టెలిఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంలో నేడు ఖురేషీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆఫ్ఘనిస్థాన్ లో జరుగుతున్న శాంతి ప్రక్రియ తదితర విషయాలలో పాకిస్తాన్ పాత్ర మర్చిపోలేమని అమెరికా సహాయ కార్యదర్శి అన్నారని ఖురేషీ తెలిపారు.