38.2 C
Hyderabad
April 28, 2024 22: 47 PM
Slider కరీంనగర్

ఉచిత విద్యుత్‌పై ఆగని మంటలు

#free electricity

కరీంనగర జిల్లాలో కాంగ్రెస్ బీఆర్‌ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. ఉచిత కరెంట్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే.

రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు కూడా చేసింది. తాజాగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జిల్లాలో బీఆర్‌ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై కోపంతో ఊగిపోయిన కాంగ్రెస్‌ నేత రోహిత్ రావు.. బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు.

అసలు ఆ ఫ్లెక్సీలో ఏముందంటే… ‘‘మూడు గంటలు కరెంట్ చాలన్న కాంగ్రెస్‌కు మా గ్రామంలో ప్రవేశం లేదు. కబర్దార్ కాంగ్రెస్ నేతల్లారా’’ అంటూ బీఆర్‌ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను చూసిన కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రోహిత్ రావు ఆ ఫ్లెక్సీలను చించివేశారు.

Related posts

పల్లె ప్రజల సృజనాత్మక శక్తిని గుర్తించమే మా లక్ష్యం

Satyam NEWS

హిందువులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నచూపు

Satyam NEWS

క్రైస్తవుడైన వై ఎస్ జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే

Satyam NEWS

Leave a Comment