27.7 C
Hyderabad
April 30, 2024 07: 52 AM
Slider వరంగల్

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలి

#journalists

ప్రైవేట్ పాఠశాలలలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) ములుగు జిల్లా కలెక్టర్ డి.వేణుగోపాల్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఐజేయు జిల్లా అధ్యక్షుడు షఫీ అహ్మద్ మాట్లాడుతూ సమాజ సేవ చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులలో రాయితీ ఇవ్వాలని, జర్నలిస్టుల పిల్లల విద్యా పట్ల  పాఠశాల యాజమాన్యాలు ఫీజుల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు రాయితీ ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ యాజమాన్యాలలో మార్పు రావడంలేదని, ఇందుకోసం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డిఈఓ పాణిని మాట్లాడుతూ జర్నలిస్టు పిల్లల విషయంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫీజుల కోసం ఇబ్బంది పెట్టినట్లు తన దృష్టికి వచ్చినట్లయితే ఆయా ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Related posts

హుజూర్ నగర్ పశు సంరక్షణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం

Satyam NEWS

అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Bhavani

కమల వికాసానికి కలిసి వస్తున్న కాలం

Satyam NEWS

Leave a Comment