తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన తక్షణ సహాయాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నీటి మునిగిన ఇండ్ల యజమానులకు నేడు అందచేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ లోని చత్రపతి శివాజీ నగర్, ప్రేమ్ నగర్ న్యూ ప్రేమ్ నగర్, సాయి అపార్ట్మెంట్ లోని ఇండ్ల యజమానులకు పదివేల రూపాయలను ఆయన అందచేశారు.
ఈ కార్యక్రమంలో డి ఎమ్ సి రమేష్ జిహెచ్ఎంసి ఏ ఎమ్ ఒ హెచ్ బిందు, డి ఇ .సునీల్, ఎర్రగడ్డ కార్పొరేటర్ షాహిన్ బేగం ఎర్రగడ్డ డివిజన్ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ డి. సంజీవ్ మాజీ కార్పోరేటర్ శరీఫ్, వార్డ్ మెంబర్ జి రాము, టిఆర్ఎస్ నాయకులు గంటా మల్లేష్, మొహమ్మద్ సర్దార్ ,సురేష్ గౌడ్, గంట శ్రీనివాస్, ఎస్ ఎల్ దీపక్, దారా సింగ్ ,రఘు, సోను నాయక్, రమేష్ టిఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.