27.7 C
Hyderabad
April 30, 2024 10: 45 AM
Slider హైదరాబాద్

చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించిన జూపల్లి

#jupalli

అనారోగ్య కారణాలవల్ల నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి కోడేరు పెద్దకొత్తపల్లి కొల్లాపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్య కారణాలతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం ఆయన పరామర్శించారు.పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామానికి చెందిన సురేష్ కోడేరు మండల పరిధిలోని మాచూపల్లి గ్రామానికి చెందిన మంచాలకట్ట ఈశ్వరమ్మ ఊపిరితిత్తులు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ నిన్న మధ్యాహ్నం నిమ్స్ ఆసుపత్రిలో చేరిన వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కొల్లాపూర్ మండలం ఎల్లూర్  గ్రామానికి చెందిన కురువ బిచ్చయ్య గత రెండు రోజులుగా గుండె నొప్పితో బాధపడుతున్న  పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన గడ్డిగోపుల అలివేల అనారోగ్యంతో బాధపడుతు 3 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని ఆడిగి తెలుసుకున్నారు.

వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై సంబంధిత వైద్యులతో అడిగి తెలుసుకున్నారు వీలైనంత త్వరగా వారి ఆరోగ్యం కుదుటపడే విధంగా చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.కుటుంబ సభ్యులకు జూపల్లి భరోసా కల్పించారు. జూపల్లితో ఆయన అనుచరులు నాయకులు తదితరులు వున్నారు.

Related posts

లక్కీ ఛాన్స్: డిప్ ద్వారా ఇండ్ల నెంబర్లు కేటాయింపు

Satyam NEWS

మానవాళిని కాపాడుకోవడానికే గ్రీన్ ఛాలెంజ్

Satyam NEWS

రైతులను విస్మరించి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీ సర్కార్

Satyam NEWS

Leave a Comment