31.7 C
Hyderabad
May 2, 2024 10: 18 AM
Slider ముఖ్యంశాలు

దివంగత ఎమ్మెల్యే నోములకు సంతాపం తెలిపిన మాజీ మంత్రి జూపల్లి

#JupallyKrishnarao

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య  సంతాప సభ లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  పాల్గొన్నారు. ఈనెల 1న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మరణించిన సంగతి అందరికి తెలిసిందే.

ఆదివారం నాగార్జున సాగర్ లో సంతాప సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్,ఇతర మంత్రులు, మాజి ఎంపీ,ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. నోముల సతీమణికి మనోధైర్యం కల్పించారు.

కుటుంబానికి  జూపల్లి సంతాపం తెలియజేశారు. అదేవిధంగా నోముల నర్సింహ్మయ్యతో ఉన్న అనుబందాన్ని సంబంధాన్ని మాజీమంత్రి జూపల్లి గుర్తు చేసుకున్నారని,ఆయనకు అశ్రునివాలులు అర్పించినట్లు  జూపల్లి అనుచరులు తెలిపారు.

Related posts

కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ప్రధాని క్లారిఫికేషన్

Satyam NEWS

రాబోయేది ప్రాంతీయ పార్టీల యుగం

Satyam NEWS

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment