నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య సంతాప సభ లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈనెల 1న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మరణించిన సంగతి అందరికి తెలిసిందే.
ఆదివారం నాగార్జున సాగర్ లో సంతాప సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్,ఇతర మంత్రులు, మాజి ఎంపీ,ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. నోముల సతీమణికి మనోధైర్యం కల్పించారు.
కుటుంబానికి జూపల్లి సంతాపం తెలియజేశారు. అదేవిధంగా నోముల నర్సింహ్మయ్యతో ఉన్న అనుబందాన్ని సంబంధాన్ని మాజీమంత్రి జూపల్లి గుర్తు చేసుకున్నారని,ఆయనకు అశ్రునివాలులు అర్పించినట్లు జూపల్లి అనుచరులు తెలిపారు.