పెరిగిన నిత్యావసర వస్తువులు,పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకు రావాలని కడప జిల్లా రాజంపేట టీడీపీ నేతలు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు.
పట్టణంలోని గాంధీ విగ్రహంకు పులా మాల వేసి వినతి పత్రాన్ని సమర్పించి నివాళులర్పించారు. శనివారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసన ప్రదర్శన చేశారు.
పెరిగిన నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకు రావాలని ఈసందర్భంగా భత్యాల చెంగల రాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా ధరలు తగ్గించాలి, జగన్ దిగి పోవాలని నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం నాయుడు,బషీర్,కృష్ణమూర్తి,సంజీవరాయుడు,అనసూయమ్మ, పోలి శివకుమార్, మందాశ్రీను, వెంకటేశ్వర్ల నాయుడు,పాండు రాజు, తదితరులు పాల్గొన్నారు